Home » జాతీయ వార్తలు » ఇందిరాగాంధీ శాంతి అవార్డుకు షేక్ హసీనా ఎంపిక
ఇందిరాగాంధీ శాంతి అవార్డుకు షేక్ హసీనా ఎంపిక
శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:00 [IST]
ఇందిరాగాంధీ శాంతి అవార్డుకు షేక్ హసీనా ఎంపిక న్యూఢిల్లీ, నవంబర్ 19 : ప్రజాస్వామ్యం, బహుళ పక్ష రాజకీయ వ్యవస్థ అభివృద్దికి విశిష్ట సేవలం దించినందుకు 2009 సంవత్సరానికి శాంతి, నిరా యుధీకరణ, అభివృద్దికి ఇచ్చే ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ శాంతి బహుమతికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజెద్ ఎంపికయ్యారు. గత సంవత్సరం ప్రధానిగా ఎన్నికైన తర్వాత షేక్ హసీనా దారి ద్య్రాన్ని, అసమానతలను తొలగించడం ద్వారా బంగ్లాదేశ్ను మధ్య ఆదాయ దేశంగా మార్చే లక్ష్యం తో 'విజన్2021 దిశగా కృషి చేస్తున్నారని ప్రధాని కార్యాలయం (పిఎంఓ) గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ''ప్రపంచశాంతిని పెంపొం దించడానికి బంగ్లాదేశ్ కట్టుబడి ఉన్నట్లు ఈ ప్రకటన ధ్రువీకరిస్తున్నది అని పిఎంఓ ఓ ప్రకటనలో పేర్కొన్నది. దారిద్య్రాన్ని నిర్మూలించి, తన ప్రజలకు సామాజిక, ఆర్ధిక న్యాయం కలుగజేయడానికి షేక్ హసీనా కృతనిశ్చయంతో చేస్తున్న సేవలను గుర్తించినట్లు ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయనిర్ణేతల సంఘం తెలిపింది. హసీనా బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడైన ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. వచ్చే సంవత్సరం ఆమె ఈ అవార్డును అందుకుంటారు. అవార్డు కింద ఆమెకు రూ.25లక్షల నగదు, జ్ఞాపికను అందజేస్తారు.